Brahmarsi Madunapanthula Venkata Paramayya
బ్రహ్మర్షి మధునాపంతుల వేంకట పరమయ్య గారు
జననం : O8.12.1931
స్వగ్రామం : పల్లెపాలెం
తల్లి తండ్రులు : గౌరీ మాణిక్యాంబ వేంకట సుబ్బారావు దంపతులు
తాత గారు : మధునాపంతుల సూరయ్య శాస్త్రి
వివాహం : 1950లో
భార్య : సూర్యకాంతం
విద్యాబ్యాసం : పెద్దాపురం
ఉద్యోగం : 1959 నుండి 1989 వరకూ లూథరన్ హైస్కూల్ లోనే
గురువులు మార్గదర్శకులు తండ్రి మధునాపంతుల సుబ్బారావు ప్రోత్సాహం, చేళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారి గురువైన తాత సూరయ్యశాస్త్రి ఆశీస్సులు అందుకుని మామగారు ద్విబాష్యము వేంకటరావుగారు ప్రేరణతో కవితారచనకు శ్రీకారం చుట్టి భమిడి సూర్యభగవత్ శాస్త్రి గారివద్ద 1948లో బాషాప్రవీణుడై, సంస్కృత భాషను సంపూర్ణంగా అధ్యయనం చేసి వేద విద్యను అవపోషణపట్టి, వ్యాకరణశాస్త్ర అవలోకనం చేసి సంస్కృతాంద్ర గ్రంధరచనా సామర్థ్యాన్ని ద్విబాషి సోమనాధ శాస్త్రిగారి ద్వారా సముపార్జించి గాంధేయవాది శ్రీ యక్కల వీర్రాజుగారి అపూర్వ సాన్నిహిత్యంలో ఆధ్యాత్మిక జీవనాన్ని అలవరచుకొని వేదుల సత్యనారాయణ శాస్త్రి సాహిత్య ప్రభావాన్ని కవితా ధోరణిని ఆకళించుకొని నేర్చుకున్న ప్రతీ మంచి విషయాన్ని నిజజీవితంలో పాటించి గొప్ప విద్యార్ధిగా, గొప్ప శిష్యునిగా ఎదిగా విలువలతో కూడిన వ్యక్తి గా జీవించి తను నేర్చుకున్న విద్యను అందరికీ పంచిన గురువుగా ఎందరికో మార్గదర్శకమైన సద్గురుగా ఆద్యాత్మిక ఆనందానికి మార్గాన్ని ప్రభోదించే పరమ పూజ్యులైన గురుదేవులుగా జీవించిన పరమయ్యగారు 07 సెప్టెంబరు 2017 న పరమపదించి శాస్వత నిద్రలోకి జారుకున్నారు
పరమయ్య గారి రచనలు
ముద్రితములు
చారుచర్య, నివేదన, కుసుమగుచ్ఛము, ఆంజనేయోదాహరణము, రచనా విషేషము, పరమహంసోదాహరణము, బాలచరితము, తిరువల్లువరు, గురుగీతము, లక్ష్మీ హృదయము, ఆత్మభోదము, ముకుందమాల, విచిత్ర భారతము, చంద్రోదయము, పార్వతీ కళ్యాణము, మల్లికామాలిక,
అముద్రితాలు
కబీరు ఉపదేశములు, నామసుద, వినాయక చరిత్ర, దేవీస్తోత్రము, ప్రేమ ప్రచారకుడు,
653total visits,1visits today